ఆది శంకరాచార్యుల జీవితం పరమ సత్యం కోసం సాగిన ఒక అద్భుతమైన మేధో ప్రయాణం. అద్వైత వేదాంతంపై ఆయనకున్న దృక్పథాన్ని "బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ నాపరః" అనే సూక్తితో సంక్షిప్తంగా చెప్పవచ్చు. అంటే బ్రహ్మం మాత్రమే శాశ్వత సత్యం, ఈ జగత్తు కేవలం ఒక దృశ్యమాన భ్రాంతి, మరియు జీవుడు పరమాత్మ కంటే వేరు కాదు అని దీని అర్థం. ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మరియు మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతాలకు భిన్నంగా, శంకరులు అద్వైత మార్గాన్ని ప్రబోధించారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ వ్యాస మహర్షి రచించిన 555 బ్రహ్మ సూత్రాలకు ఆయన రాసిన భాష్యంపై ఆధారపడి ఉన్నాయి. "అథాతో బ్రహ్మ జిజ్ఞాస" (ఇకపై బ్రహ్మమును గురించిన విచారణ) అనే తొలి సూత్రమే శంకరుల అన్వేషణకు మూలాధారం.
కేవలం 32 ఏళ్ల స్వల్ప కాలంలోనే శంకరులు కేరళలోని కాలడి నుండి హిమాలయాల వరకు పర్యటించి, తన తార్కిక శక్తితో మేధో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. పాత భావనలకు నూతన ఉత్తేజాన్ని ఇస్తూ, పండితులతో వాదించి వారిని ఒప్పించడమే కాకుండా, తన తల్లి అంత్యక్రియల విషయంలో ఒక సన్యాసిగా సామాజిక సంప్రదాయాలను ధిక్కరించి మానవత్వానికి పెద్దపీట వేశారు. ఆయన కేవలం మేధావులకే పరిమితం కాకుండా, భజ గోవిందం మరియు సౌందర్యలహరి వంటి మధురమైన స్తోత్రాల ద్వారా సామాన్య ప్రజలలో భక్తిని, జ్ఞానాన్ని నింపారు. శంకరుల ప్రకారం బ్రహ్మం అనేది నిజానికి నిర్గుణమైనది కానీ మనకు అది సగుణంగా కనిపిస్తుంది. దీనిని వివరించడానికి ఆయన ప్రసిద్ధమైన రజ్జు-సర్ప భ్రాంతి (తాడు-పాము) ఉదాహరణను వాడారు. చీకటిలో ఉన్న తాడును చూసి పాము అనుకోవడం అజ్ఞానమైతే, వెలుతురులో అది తాడు మాత్రమే అని గుర్తించడం జ్ఞానం.
అలాగే, జ్ఞానాభ్యాసం వల్ల కలిగే శుద్ధిని చిల్లగింజ పొడితో పోల్చారు. నీటిలోని బురదను అడుగుకు చేర్చి తానూ కరిగిపోయే చిల్లగింజ పొడిలాగే, ఆత్మజ్ఞానం కూడా అజ్ఞానాన్ని తొలగించి, అంతిమంగా తానూ ఆ సాక్షాత్కారంలో లీనమైపోతుంది. మరోచక్కని ఉదాహరణలో, వెన్నెల రాత్రి సముద్ర తీరంలో పడి ఉన్న ముత్యపు చిప్పలను వెండిగా భ్రమపడటాన్ని పేర్కొన్నారు. వెండి అనే భ్రమ ఉన్నంత సేపే ఆ వస్తువుకు విలువ ఉంటుంది, సత్యం తెలిశాక అది కేవలం చిప్పే. అలాగే ఆత్మజ్ఞానం కలిగే వరకు మాత్రమే ఈ ప్రపంచం సత్యంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులలోని మహావాక్యాల ద్వారా ఈ సత్యాన్ని శంకరులు బలపరిచారు. 'నేతి-నేతి' (ఇది కాదు, ఇది కాదు) అనే ప్రక్రియ ద్వారా మన దేహం, మనస్సు ఆత్మ కాదని నిరూపిస్తూ అసలైన బ్రహ్మ తత్వాన్ని గుర్తించాలని బోధించారు.
ఈ ఆత్మజ్ఞానానికి మూలాధారమైన ఉపనిషత్తులలోని సంపూర్ణ మహావాక్య శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి:
తత్ త్వమ్ అసి (సామవేదం - ఛాందోగ్య ఉపనిషత్తు):
స య ఏషోऽణిమైతదాత్మ్యమిదం సర్వం
తత్సత్యం స ఆత్మా తత్త్వమసి శ్వేతకేతో
సూక్ష్మమైన ఆ సత్తా ఏదైతే ఉందో, అదే ఈ జగత్తు అంతటికీ ఆత్మ. అదియే సత్యము. అదియే ఆత్మ. ఓ శ్వేతకేతూ! ఆ పరమాత్మవు నీవే అయి ఉన్నావు అని పై శ్లోకం అర్ధం.
అహం బ్రహ్మాస్మి (యజుర్వేదం - బృహదారణ్యక ఉపనిషత్తు):
బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్, తదాత్మానమేవావేత్,
అహం బ్రహ్మాస్మి తి తస్మాత్ తత్సర్వమభవత్
సృష్టికి పూర్వం ఈ జగత్తు బ్రహ్మముగానే ఉండెను. అది తనను తాను 'నేను బ్రహ్మమును' అని తెలుసుకున్నది. ఆ జ్ఞానము వల్ల అది సర్వము అయినది అని ఈ శ్లోకం భావం.
థౌఘ్త్ ఆది శంకరాచార్యులు సత్య అన్వేషణ కోసం సాధన చతుష్టయం అనే విశిష్ట మార్గాన్ని బోధించారు. ఇందులో నిత్య అనిత్య వస్తు వివేకం, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి మరియు ముముక్షుత్వం అనే నాలుగు అర్హతలు ఉన్నాయి. ఇవి సాధకుడి అంతరంగాన్ని శుద్ధి చేసి, మోక్ష సాధనకు సిద్ధం చేస్తాయి. కేవలం మేధోపరమైన చర్చలే కాకుండా, క్రమశిక్షణతో కూడిన ఈ ఆచరణ ద్వారానే బ్రహ్మజ్ఞానం సాధ్యమని శంకర భగవత్పాదులు స్పష్టం చేశారు.
శంకరాచార్యులు కేవలం ఒక సిద్ధాంతకర్త మాత్రమే కాదు, భక్తి సామ్రాజ్యాన్ని ఏలిన గొప్ప తత్వవేత్త. ఆయన రచనలు మేధస్సుకు సవాలు విసురుతూనే, హృదయాన్ని దైవత్వం వైపు నడిపిస్తాయి. నేటికీ శంకరుల ఆలోచనా విధానం ఒక స్వేచ్ఛాయుతమైన విచారణకు మరియు ఆత్మజ్ఞానానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.