పోతన భాగవతం చదువుతున్నాను. అందులో కొన్నిభాగాల్లో ఇతర కవులు పూరించిన విషయం ఉంది గానీ ఈ తెలుగువారి మధురగ్రంథం వెనక ఇంత కథ ఉందని శ్రీ మురళీధర రావుగారి ఈ వ్యాసం మూలానే తెలిసింది. ధన్యుడిని.
శ్రీమహాభాగవతము యొక్క ఈనాటి ముద్రిత ప్రతి ఏ తీరున రూపుదిద్దుకొన్నదో అన్న ప్రచురణ ప్రకాశన కథానకం నిజంగానే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. కారణజన్ములైన శ్రీ బమ్మెర పోతన గారి మహారచనోద్యమంలో సహపంక్తికి నోచికొని తెలుగు జాతిని ధన్యతములను కావించిన ఏర్చూరి సింగనామాత్యుని గూర్చిన ఈ వ్యాసప్రస్తావిక మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతము తెలుగువారి పుణ్యఫలము. భక్తిపరముగా గాని , సాహిత్యపరముగా గాని యీ గ్రంథమును పఠించగలిగిన వారు ధన్యులు. దీనిని పఠించెడు వారలకు పద్యసాహిత్యాభిలాష యినుమడిస్తుంది. పోతన విశిష్టాద్వైతియో కాదో తెలియదు కాని భాగవతములో అద్వైత పోకడలు బాగానే కనిపిస్తాయి.
మాన్యులు ,ఉభయభాషాకోవిదులు, సత్కవులు , విశిష్ఠ పరిశోధకులు , చక్కని సమీక్షకులు శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారు యీ తరపు సాహితీప్రియుల కందుబాటులో నుండుట అదృష్టము. వీరి వ్యాసములైనా , పద్యములనైనా తగినంత తీరిక చేసుకొనే నేను చదువుతాను. ఆ సమయము లేకపోతే వ్యాసాంశములైనా , భాషాపటిమనైనా ఆకళింపు జేసుకొనుట , ఆనందించుట నాకు సాధ్యము కాదు. ఇప్పటి సమీక్ష వీరి యితర వ్యాసావళికి యే మాత్రము భిన్నము కాదు.
పోతనామాత్యులు భాగవతము గురించి ,
అని అది కల్పతరువని ఉర్విలో అనశ్వరమై వర్ధిల్లుతుందని చెప్పారు. ఆ మాటను శ్రీ మురళీధరరావు గారు మరల వక్కాణించారు. పోతన ప్రణీతమైన భాగవతాలయములో కొంత భాగము జీర్ణమయినా మహానుభావులు శ్రీ వెలిగందల నారాయణామాత్యులు , శ్రీ ఏర్చూరి సింగనామాత్యులు , శ్రీ బొప్పన గంగనామాత్యులు తమ తమ ప్రతిభానైపుణ్యములతో భాగవతమునకు పునః సంపూర్ణతను సమకూర్చారు.
నిజమే ! పోతన గారి శబ్దసంవిధానము , అర్థస్ఫూర్తి అననుకరణీయములు. పరిమిత భాషాసంపత్తి , విమర్శనాత్మక దృష్టి గల నా చక్షువులకే అది సుస్పష్టము. శ్రీ వెలిగందల నారాయణామాత్యులు పోతన అడుగుజాడలలో నడిచినా శ్రీ బొప్పన గంగనామాత్యులు స్వతంత్ర మార్గములో నడచుటయే కాక , నందగోపకుమారా ! అని పద్యావళిని ద్వాపరయుగ పురుషునికి అంకితమిచ్చారు. సింగనామాత్యులు షష్ఠస్కంధమును అచ్యుతుని , కృపావాసుని ప్రశంసిస్తూ విభిన్న మార్గములో ప్రారంభించారు . వారి గురించి శ్రీ ఏల్చూరి వారింకా విపులంగా సమీక్షిస్తారని భావిస్తున్నాను..
శ్రీకైవల్య పదంబుకై భాగవతాంధ్రీకరణకు పూనుకొన్న సాత్విక మహర్షి పోతనామాత్యులే తన పుట్టుపూర్వముల గురించి యెఱుకపఱచి నప్పుడు శ్రీ బొప్పన గంగనామాత్యులు వారు ఆత్మీయకర్తృత్వాహంతను విస్మరించజాలకపోవుటను తప్పుపట్టలేమేమో . నిజానికి అది చాలా మంచిది. లేని సందర్భములో ఆ పద్యముల నింకెవరో చొప్పించినారనే సందిఘ్నము కలుగక పోదు.
శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారి వ్యాసము విజ్ఞానదాయకము. చాలా మనోహరముగా నున్నది. పలుమారులు పఠించదగినది. వారిని తలచుకున్నపుడల్లా , వారి పాండిత్యమునకు హృదయము పులకరిస్తుంది. వారికి నమోవాకములు.
సిరిమల్లె సంపాదకవర్గమునకుహృదయపూర్వకాభినందనలు.
పూజ్యులైన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
ప్రణామములతో,
పరమ పావన భాగవతాగ్రేసరులైన మీ యొక్క ఔదార్యపూర్ణ స్పందనకు, సదయానుమోదానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరన్నట్లు కావ్యకర్తలకు ఎంతో కొంత కర్తృత్వాహంత ఉండటం వల్లనే సాహిత్యచరిత్రకు పరికరించే ప్రామాణిక సాధనసామగ్రి లభించింది. ఇప్పటి వరకు దొరికిన సరిక్రొత్త ఆధారాలతో తెలుగు సాహిత్యచరిత్రను అభినవంగా నిర్మింపవలసిన అవసరం ఉన్నది.
చాలా బావుంది సార్!
తెలియని విషయాలు, అదీ మీలాటి వారి అమృతమైన వాక్కుల్లో చదవటం మరింత జ్ఞానం కలగజేస్తుంది
మీ రచనలన్నీ ఒక పుస్తకంగా తీసుకువస్తే మరింత ఇదిగా ఉంటుందని అభిప్రాయం సార్! ఆ దిశగా ఆలోచించండి
భవదీయుడు
వంశీ
పోతన భాగవతం చదువుతున్నాను. అందులో కొన్నిభాగాల్లో ఇతర కవులు పూరించిన విషయం ఉంది గానీ ఈ తెలుగువారి మధురగ్రంథం వెనక ఇంత కథ ఉందని శ్రీ మురళీధర రావుగారి ఈ వ్యాసం మూలానే తెలిసింది. ధన్యుడిని.
-వాసు-
శ్రీమాన్ వాసు గారికి
నమస్కారములతో,
శ్రీమహాభాగవతము యొక్క ఈనాటి ముద్రిత ప్రతి ఏ తీరున రూపుదిద్దుకొన్నదో అన్న ప్రచురణ ప్రకాశన కథానకం నిజంగానే చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. కారణజన్ములైన శ్రీ బమ్మెర పోతన గారి మహారచనోద్యమంలో సహపంక్తికి నోచికొని తెలుగు జాతిని ధన్యతములను కావించిన ఏర్చూరి సింగనామాత్యుని గూర్చిన ఈ వ్యాసప్రస్తావిక మీకు నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఇంతచక్కటి విశ్లేషాత్మక వ్యాసం అందించిన సిరిమల్లెవారికి . . . రచయితకు . . . ధన్యవాద పూర్వక నమస్కృతులు . .
– భాగవత గణనాధ్యాయి.
శ్రీ భాగవత గణనాధ్యాయి
శ్రీమాన్ సాంబశివరావు గారికి నమస్కారములతో,
శ్రీమహాభాగవత సర్వ విశేష పరిజ్ఞాతలైన మీ అనుమోదానికి నోచికొన్నందుకు ధన్యవాదాలు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతము తెలుగువారి పుణ్యఫలము. భక్తిపరముగా గాని , సాహిత్యపరముగా గాని యీ గ్రంథమును పఠించగలిగిన వారు ధన్యులు. దీనిని పఠించెడు వారలకు పద్యసాహిత్యాభిలాష యినుమడిస్తుంది. పోతన విశిష్టాద్వైతియో కాదో తెలియదు కాని భాగవతములో అద్వైత పోకడలు బాగానే కనిపిస్తాయి.
మాన్యులు ,ఉభయభాషాకోవిదులు, సత్కవులు , విశిష్ఠ పరిశోధకులు , చక్కని సమీక్షకులు శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారు యీ తరపు సాహితీప్రియుల కందుబాటులో నుండుట అదృష్టము. వీరి వ్యాసములైనా , పద్యములనైనా తగినంత తీరిక చేసుకొనే నేను చదువుతాను. ఆ సమయము లేకపోతే వ్యాసాంశములైనా , భాషాపటిమనైనా ఆకళింపు జేసుకొనుట , ఆనందించుట నాకు సాధ్యము కాదు. ఇప్పటి సమీక్ష వీరి యితర వ్యాసావళికి యే మాత్రము భిన్నము కాదు.
పోతనామాత్యులు భాగవతము గురించి ,
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
అని అది కల్పతరువని ఉర్విలో అనశ్వరమై వర్ధిల్లుతుందని చెప్పారు. ఆ మాటను శ్రీ మురళీధరరావు గారు మరల వక్కాణించారు. పోతన ప్రణీతమైన భాగవతాలయములో కొంత భాగము జీర్ణమయినా మహానుభావులు శ్రీ వెలిగందల నారాయణామాత్యులు , శ్రీ ఏర్చూరి సింగనామాత్యులు , శ్రీ బొప్పన గంగనామాత్యులు తమ తమ ప్రతిభానైపుణ్యములతో భాగవతమునకు పునః సంపూర్ణతను సమకూర్చారు.
నిజమే ! పోతన గారి శబ్దసంవిధానము , అర్థస్ఫూర్తి అననుకరణీయములు. పరిమిత భాషాసంపత్తి , విమర్శనాత్మక దృష్టి గల నా చక్షువులకే అది సుస్పష్టము. శ్రీ వెలిగందల నారాయణామాత్యులు పోతన అడుగుజాడలలో నడిచినా శ్రీ బొప్పన గంగనామాత్యులు స్వతంత్ర మార్గములో నడచుటయే కాక , నందగోపకుమారా ! అని పద్యావళిని ద్వాపరయుగ పురుషునికి అంకితమిచ్చారు. సింగనామాత్యులు షష్ఠస్కంధమును అచ్యుతుని , కృపావాసుని ప్రశంసిస్తూ విభిన్న మార్గములో ప్రారంభించారు . వారి గురించి శ్రీ ఏల్చూరి వారింకా విపులంగా సమీక్షిస్తారని భావిస్తున్నాను..
శ్రీకైవల్య పదంబుకై భాగవతాంధ్రీకరణకు పూనుకొన్న సాత్విక మహర్షి పోతనామాత్యులే తన పుట్టుపూర్వముల గురించి యెఱుకపఱచి నప్పుడు శ్రీ బొప్పన గంగనామాత్యులు వారు ఆత్మీయకర్తృత్వాహంతను విస్మరించజాలకపోవుటను తప్పుపట్టలేమేమో . నిజానికి అది చాలా మంచిది. లేని సందర్భములో ఆ పద్యముల నింకెవరో చొప్పించినారనే సందిఘ్నము కలుగక పోదు.
శ్రీ ఏల్చూరి మురళీమోహనరావు గారి వ్యాసము విజ్ఞానదాయకము. చాలా మనోహరముగా నున్నది. పలుమారులు పఠించదగినది. వారిని తలచుకున్నపుడల్లా , వారి పాండిత్యమునకు హృదయము పులకరిస్తుంది. వారికి నమోవాకములు.
సిరిమల్లె సంపాదకవర్గమునకుహృదయపూర్వకాభినందనలు.
పూజ్యులైన శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి
ప్రణామములతో,
పరమ పావన భాగవతాగ్రేసరులైన మీ యొక్క ఔదార్యపూర్ణ స్పందనకు, సదయానుమోదానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరన్నట్లు కావ్యకర్తలకు ఎంతో కొంత కర్తృత్వాహంత ఉండటం వల్లనే సాహిత్యచరిత్రకు పరికరించే ప్రామాణిక సాధనసామగ్రి లభించింది. ఇప్పటి వరకు దొరికిన సరిక్రొత్త ఆధారాలతో తెలుగు సాహిత్యచరిత్రను అభినవంగా నిర్మింపవలసిన అవసరం ఉన్నది.
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు