Menu Close
వీక్షణం-154వ సాహితీ సమావేశం
-- ప్రసాదరావు రామాయణం --
vikshanam-154

వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా 154వ.ప్రపంచ సాహితీ సమావేశం జూన్ 20, 2025 న అద్భుతంగా జరిగింది. కాలిఫోర్నియా కాలమానంలో సాయంత్రం 6.00కు ఈ సమావేశం గీతామాధవి గారి స్వాగత వచనాలతో ప్రారంభమైంది. ఈనాటి ముఖ్య అతిథి డా. టి.గౌరీశంకర్ గారిని గీతామాధవి గారు సభకు పరిచయం చేశారు.

హైదరాబాద్ లో జన్మించిన గౌరీశంకర్ గారు ప్రముఖ విద్యావేత్త, సాహితీమూర్తి. తెలుగులో ఎమ్మే, ఎంఫిల్, పీ ఎచ్ డీ చేశారు. సీనియర్ తెలుగు ప్రొఫెసర్ గానూ, జర్నలిస్ట్ గానూ పేరు ప్రఖ్యాతులు గడించారు. సమాచార పౌరశాఖలో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్ర భాషా సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా పని చేశారు. పరిపాలనా రంగంలోనూ, బోధనారంగంలోనూ అపారమైన అనుభవాన్ని గడించారు.

డా. టి.గౌరీశంకర్ గారు "తెలుగు భాష ప్రాచీనత- విశిష్టత" అనే అంశమ్మీద ప్రసంగించారు. తమ ప్రసంగంలో భాషకు నిర్వచనం దగ్గరనుండి వివిధ భాషలు ఎలా ఏర్పడినాయి, వాటి చరిత్రను వివరించారు. మనదేశంలో 1600 భాషలు ఉన్నాయని, అందు గుర్తింపబడిన భాషలు 22 అని చెబుతూ మన తెలుగు భాష ద్వితీయ స్థానం నుండి చతుర్థ స్థానానికి పడిపోవడం బాధాకరమని అంటూ దానికి గల కారణాలను వివరించారు. తెలుగుభాష యొక్క ప్రాచీనత, ప్రత్యేకతలు, వైశిష్ట్యాన్ని గురించి వివరించారు. సుమారు 45 నీ.సెలయేటి ఝరిలా వారు ప్రసంగించిన తీరు అనన్యం!

కొందరి శ్రోతల స్పందన పిదప శ్రీ రాజేంద్రప్రసాద్ గారు, శ్రీమతి కోదాటి అరుణ గారి అధ్యక్షతన కవి సమ్మేళనం ప్రారంభమైనది. తొలిగా శ్రీ గౌరీశంకర్ గారు చిన్న కవిత "నల్లని పలకపై తెల్లని గీతలు" చదివి వినిపించారు.

తరువాత కె.గీతగారు 'మిస్డ్ లెటర్' అనే తమ కవితలో ఉత్తరాలు వ్రాసుకునే మధురమైన రోజులను గుర్తు చేశారు.అద్భుతం!,మాటలు తెగిపడిన అవయవాలయ్యాయని వాపోయారు. శ్రీ నాళేశ్వరం శంకర్ గారు మాతృభాషను తల్లి అనురాగంతో పోలుస్తూ చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. సినీ గేయచయిత మౌనశ్రీ మల్లిక్ గారు తన శ్రావ్యమైన కంఠంతో "అంతర్ముఖీనం" అనే కవితలో చెట్టూ, పుట్టా శుకపికాలు కూడా మనతో మాట్లాడతాయి మాట్లాడే మనసు మనకుంటే అని చెప్పారు. ఎంత అందమైన కవితో! శ్రీ ఘంటా మనోహర్ రెడ్డిగారు తనదైన తాళ ధ్వనితో 'ఘంటారావం 'అనే కవిత శ్రోతలను ఆకర్షించింది. శ్రీమతి కోదాటి అరుణగారు వీక్షణం సమావేశాల గురించి హాయిగా పాడారు.శ్రీ అయ్యలరాజు సోమయాజులుగారు యోగాగురించి చెబుతూ కాదేదీ వయసుకనర్హం అన్నారు. శ్రీ వెంకటదాస్ గారు తెలుగుభాషా ఔన్నత్యం గురించి కవిత చదివారు. శ్రీ వెంకటేష్ గారు తన కవితలో విద్యార్థులు ఎలా తమ మేధను ఉపయోగించుకోవాలో చెప్పారు. ప్రసాదరావు రామాయణం అనే నేను "పారేసుకున్నాడు మనిషి ఎక్కడో మానవతకే వరమైన మందహాసం" అంటూ మందహాసం మాయం కావడానికి గల పరిస్థితులను వివరించాను. శ్రీ కందుకూరి శ్రీరాములు గారు 'క్రొత్త ప్రపంచం' అనే తన కవితలో తెలుగు వ్రాయడంలోని ఇబ్బందులను తెలియచేశారు. అరుణగారు రైతు నేపథ్యాన్ని తీసుకుని కమ్మని పాటపాడారు. చీదెళ్ల సీతాలక్ష్మి గారు "జీవన సంజీవిని" అనే వారి కవితలో యోగా ప్రాధాన్యాన్ని వివరించారు.

అవధానం అమృతవల్లిగారి కవిత అందరినీ ఆకట్టుకుంది. వెంకట సత్యమూర్తిగారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత వినిపించారు. పరాంకుశం కృష్ణవేణి గారు" చిరునవ్వుల చిరునామా అనే కవిత అద్భుతం! శ్రీ గుర్రం మల్లేశం గారు "వెలుగు జిలుగు" అని తొలకరిపై పద్యాలు చదివారు. శ్రీ కమర గారు పంచభూతాలకు ప్రాణాలు వచ్చాయి అంటూ ఒక్కొక్క అగ్గికి ఒక్కొక్క రూపం చూపారు. శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావుగారు జీవితం అనే తనకవిత నర్తనంలా ఉంది. ఆనం ఆశ్రితారెడ్డి గారు విమాన ప్రమాదాన్ని గురించి కవిత్వీకరించారు. బృందగారు 'హృదయ హారతి' అనే తమ కవితలో యోగా ప్రాధాన్యతను చెప్పారు. పవిత్రగారు ఆడపిల్లల కష్టాలగురించి ఆర్ద్రంగా కవిత వినిపించారు.సుధా కొలచన గారు తెలివి తెచ్చుకో అనే తన కవితను తెలంగాణా యాసలో చదివి ఆకట్టుకున్నారు.శోభా దేశ పాండే గారు విమాన ప్రమాదంపై కవిత వినిపించారు. వనజ గారు  విద్యార్థులు బాధ్యత అనే అంశంపై గానించారు.

చివరిగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు తన సహజమైన గంభీర స్వరంతో 'సాహిత్య సౌరభాలు' అనే కవితతో నిజంగానే సౌరభాలు వెదజల్లారు. చివరిగా గీతామాధవి గారి వందన సమర్పణతో ఈనాటి సమావేశం ముగిసింది.

అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in July 2025, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *