Menu Close
అట్టహాసంగా కాలిఫోర్నియా "వీక్షణం" సాహితీ గవాక్షం 12వ వార్షికోత్సవం!
vikshanam-145

వీక్షణం 12 వ వార్షికోత్సవం అటు కాలిఫోర్నియాలోనూ, ఇటు అంతర్జాలంలోనూ సెప్టెంబరు 14, 20, 21వ తేదీల్లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రముఖ కథారచయిత, భాషా నిపుణులు, వేమూరి నిఘంటు నిర్మాణ కర్త డా||వేమూరి వేంకటేశ్వర్రావు గారికి వీక్షణం "జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేసి ఘనంగా సత్కరించింది.

సెప్టెంబరు 14, 2024 తేదీన కాలిఫోర్నియాలోని ప్లెసంటన్ నగరంలో జరిగిన వీక్షణం 12వ వార్షికోత్సవాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.కె.గీత గారు నిర్వహించారు. ముందుగా ఈ వార్షికోత్సవ సందర్భంగా డా||వేమూరి వేంకటేశ్వర్రావు గారికి వీక్షణం "జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేసి ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమం తరువాత వీక్షణం 12 వ వార్షికోత్సవ ప్రత్యేక సంచికల ఆవిష్కరణలు శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి పాతూరి, డా.కె.గీత, శ్రీ వేణు ఆసూరి, శ్రీ తల్లాప్రగడ రావు, శ్రీ శ్రీధర్ రెడ్డిగార్ల చేతుల మీదుగా జరిగాయి. ముఖ్య అతిథిగా శ్రీ దేవినేని మధుసూదనరావు విచ్చేసి "తెలుగు- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే అంశంమీద ప్రసంగించారు. తరువాత శ్రీ తల్లాప్రగడ రావు గారి నిర్వహణలో జరిగిన కవిసమ్మేళనం యువకవి శ్రీ ఆది మోపినేని కవిత్వగానంతో ప్రారంభమైంది. స్థానిక ప్రముఖ కవులు డా.కె.గీత, శ్రీమతి షంషాద్, శ్రీ శ్రీధర్ రెడ్డి మొ.న వారు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.

తరువాత శ్రీమతి శారద కాశీవఝల ఆధ్వర్యంలో జరిగిన ఇష్టాగోష్టిలో శ్రీ కిరణ్ ప్రభ, శ్రీ వేణు ఆసూరి, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీ ప్రసాదరావు గోగినేని, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ గాంధీ ప్రసాద్, శ్రీ సత్యనారాయణ ప్రసాద్, శ్రీ వేమూరి శ్రీరామ్, శ్రీమతి జయశ్రీ మొ.నవారు పాల్గొన్నారు. ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశంలో కాలిఫోర్నియా స్థానిక కవులు, రచయితలు, సాహిత్యాభిలాషులు పాల్గొని సభను విజయవంతం చేసారు.

సెప్టెంబరు 20/21, 2024 తేదీలలో వీక్షణం 12 వ వార్షికోత్సవం అంతర్జాలంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, డా.కె. గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో ముందుగా వీక్షణం భారత దేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వీక్షణం ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు, శ్రీ వసీరా ఆత్మీయ వాక్యాలు పలికారు. శ్రీమతి సుధా కొలచన కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, అమెరికా దేశాలనుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, డా||కె.గీత, వ‌సీరా, కమర, శ్రీధర్ రెడ్డి బిల్లా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శ్రీసుధ కొలచన, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మామిళ్ల లోకనాథం, మల్కని విజయలక్ష్మి, ఎస్. రత్నలక్ష్మి, అమృతవల్లి అవధానం, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డా. కందేపి రాణీప్రసాద్, లగిశెట్టి రాము, కె వి యస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి), చిట్టాబత్తిన వీరరాఘవులు, అమీనా కలందర్, ప్రసాదరావు రామాయణం, డా. అరుణ కోదాటి, గుర్రం మల్లేశం, మనోహర్ రెడ్డి గంటా, రామకృష్ణ చంద్రమౌళి, ఉప్పలపాటి వెంకట రత్నం, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), శోభాదేశపాండే, జె.వి.కుమార్ చేపూరి మొదలగు వారు పాల్గొని కవితాగానం చేసారు.

ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సందర్భంగా వీక్షణం అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, కవితల పోటీ విజేతలకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

గత పన్నెండేళ్లుగా "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, గత రెండేళ్లుగా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతున్నది.

Posted in October 2024, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!